హామిల్టన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో 45 పరుగులు చేసిన కోహ్లి.. రెండో టీ20లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే కివీస్తో మూడో టీ20లో కోహ్లి 25 పరుగులు చేస్తే ఎంఎస్ ధోని రికార్డును బ్రేక్ చేస్తాడు. అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్గా ధోని చేసిన పరుగులు 1,112. ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్ చేయడానికి కోహ్లికి 25 పరుగులు అవసరం. భారత్ తరఫున కెప్టెన్గా అత్యధిక టీ20 పరుగులు చేసిన రికార్డు ఇప్పటివరకూ ధోని పేరిట ఉంది. ఇది రేపటి మ్యాచ్లో బద్ధలయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ లిస్టులో డుప్లెసిస్(1,273), కేన్ విలియమ్సన్(1,148)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
కోహ్లిని ఊరిస్తున్న కెప్టెన్సీ రికార్డులు